నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్ల మార్చి, ఏప్రిల్‌, మే నెలల కోటాను ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి. అదే విధంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఇది కొనసాగుతుంది.

మరోవైపు తెలంగాణలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం జరుపుతామని చెప్పారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని యాదాద్రీశుడి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version