ఈనెల 22న ఆన్‌లైన్‌లో.. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వేంకటేశ్వరుని సన్నిధిలో జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను  టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు రోజుకు రెండువేల టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో కోటాను విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందని వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న 7 కల్యాణ మండపాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నందున 2023, మార్చి ఒకటో తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి భక్తులకు అడ్వాన్స్‌ బుకింగ్‌ కేటాయిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news