T20 వరల్డ్ కప్ ఆడాలని లేదా మియా?

-

టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న ఏకైక తెలుగు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అతడి గణాంకాలు చూసి అభిమానులు నిట్టూరుస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ దారుణ ప్రదర్శన చూసి నిరాశ చెందుతున్నారు. ఈ ఐపీఎల్ లో 6 మ్యాచ్లు ఆడి 4 వికెట్లే తీశారు. మరోవైపు పరుగులు కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఇకనైనా సిరాజ్ తిరిగి తన ఫామ్ అందుకుంటే మంచిదని.. లేదంటే T20 వరల్డ్ కప్ లో చోటు కష్టమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా చేదించింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ బెంగళూరు బౌలర్లను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఒక్క బౌలర్ కూడా సరిగా ప్రదర్శన చేయలేకపోయాడు. నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లలో ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news