నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో చ‌ర్చించే అంశాలివేనా..

-

నేటి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో డిసెంబర్ 1 నుంచి మార్చి నెల వరకు ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ‘వైఎస్‌ఆర్‌ నవశకం’ పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు గాను కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణి, ప్రస్తుతం జరుగుతున్న సాగునీటి ప్రోజెక్టుల పనులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

అలాగే రాజధాని పరిధి సీఆర్‌డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి.. వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశంఉంది. అదే విధంగా ‘జగనన్న విద్యా దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనలకు, డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్‌ ఫీజుల కింద ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ‘జగనన్న వసతి’కి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news