రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్రకు నేడు విరామం

-

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ” భారత్ జోడో” యాత్రకు నేడు విరామం ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభమై వారం రోజులు దాటడంతో ఒకరోజు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 15వ తేదీన ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం కేరళలోని కొల్లాం నుండి యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది.

ఈ విషయాన్ని బుధవారం రోజు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేశారు. అయితే రాహుల్ గాంధీతో పాటు సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడుతుండడంతో యాత్రకు ఒకరోజు విరామంమం ప్రకటించారు. ఈ యాత్ర కేరళలో మొత్తం 18 రోజులపాటు కొనసాగాల్సి ఉంది. కేరళ నుంచి ఈ నెల 30వ తేదీన కర్ణాటకలోకి ఈ యాత్ర చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version