Tokyo Paralympics: ఇండియా ఖాతాలో మరో బంగారు పతకం

-

టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు తమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 18 పతకాలు సాధించిన మన భారత క్రీడాకారులు… తాజాగా మరో పతకాన్ని సాధించారు. టోక్యో పారా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు మరో పసిడి పతకం వచ్చింది.

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SH6 ఈవెంట్ ఫైన ల్లో భారత పారా షట్లర్ కృష్ణ నగర్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SH6 ఈవెంట్ ఫైనల్లో… హాంకాంగ్‌ దేశాని కి చెందిన చు మాన్ కాయ్‌ని ఓడించి.. షట్లర్ కృష్ణ నగర్.. పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో భారత ఖాతాలో మరో పతకం చేరింది. ఈ పసిడి పతకం తో భారత పతకాల సంఖ్య 19 కి చేరింది. దీంతో ఇప్పటి వరకు టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత్ కు 5 స్వర్ణాలు, 8 రజతాలు మరియు 6 కాంస్యా లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news