రేపే ఎగ్జిట్ పోల్స్… ఈసీ కీలక ఆదేశాలు

-

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటికీ చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. జూన్ ఒకటవ తేదీన చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఈ పోలింగ్ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ తో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news