హైదరాబాద్ నుండి ఊటీకి టూర్ ప్యాకేజీ… వీటినన్నీ చూసొచ్చేయండి..!

-

ఐఆర్‌సీటీసీ ఇప్పటికే చాలా ప్యాకేజీలను తీసుకు వచ్చింది. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి ఊటీకి టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. హనీమూన్ వెళ్లాలనుకునే కొత్త జంటలకు ఇది బెస్ట్ ప్యాకేజీ. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ టూర్ ప్యాకేజీ లో భాగంగా ఊటీ, కూనూర్ లాంటి ప్రాంతాలు చూసి వచ్చేయచ్చు.

ప్రతీ మంగళవారం ఈ టూర్ మీకు అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఇక సెకండ్ డే దయం 8 గంటలకు కొయంబత్తూర్ రీచ్ అవుతారు. అక్కడ నుండి ఊటీ కి వెళ్ళాలి.

హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ని చూడచ్చు. ఇక ఇది ఇలా ఉంటే మూడో రోజు ఉదయం దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూడచ్చు. నాలుగో రోజు కూనూర్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఐదో రోజు ఉదయం ఊటీ నుంచి కొయంబత్తూర్ వెళ్ళాలి. రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే ఆరోరోజు మధ్యాహ్నం 12:20 గంటలకు టూర్ ఎండ్ అవుతుంది.

ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. స్టాండర్డ్ క్లాస్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,730, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,190, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,150. అదే కంఫస్ట్ క్లాస్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,190, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,640, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.24,610. పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version