తిరుపతిలో విషాదం…కారుపై పెట్రోల్ పోసి, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తగలబెట్టిన దుండగులు

-

తిరుపతి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి కారుపై పెట్రోల్ పోసి.. కారులో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజును తగలబెట్టారు కొంత మంది దుండగులు. తిరుపతి నుంచి నాగరాజ్‌ స్వగ్రామం బ్రాహ్మణపల్లికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడుని గుర్తించిన పోలీసులు… ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యమైనట్లు పేర్కొన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. దీంతో
కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. మృతుడు నాగరాజు కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిఐ ఓబులేసు ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news