వ్యూహం, శపథం సినిమాల ట్రైలర్ రిలీజ్

-

ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితం ఆధారంగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. వైఎస్ మరణం నుంచి మొదలై జగన్ పార్టీ పెట్టడం, సీఎం కావడం వంటి ఘటనలను ఇందులో చూపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్రలు ఉన్నాయి. ‘వ్యూహం’ సినిమా ఈ నెల 23న.. రెండో పార్ట్ ‘శపథం’ మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తుంది.సినిమాలో వైఎస్సార్ మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. మొదలగు అంశాలపై ఈ సినిమా రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news