ఏపీలో ట్రావెల్ బస్సు బోల్తా : ఏకంగా 20 మంది !

-

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు మరియు నిబంధనలు అమలు చేసినప్పటికీ ని…. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. నిర్లక్ష్యం మరియు ఓవర్ స్పీడ్ కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక రకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా… ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ సమీపంలో సాయి కృష్ణ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

లారీని తప్పించబోయి..బోల్తా కొట్టింది ట్రావెల్ బస్సు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మందికి గాయాలు తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. దీంతో 108 వాహనాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించింది వైద్య సిబ్బంది. ఇక ఈ ఘటన విజయవాడ నుండి శ్రీకాకుళం వెళ్తుండగా చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు..ఈ ఘటన లో బస్సు డ్రైవర్‌ తప్పిదం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news