అన్ని అమ్ముతారు… కానీ ధాన్యం కొనుగోలు మాత్రం చేయరు అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశాన్ని నడిపే వాళ్లకు రైతులపై ప్రేమ లేదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో సిరిసిల్లలో పాల్గొన్నారు. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయానికి 6 గంటల కరెంట్ కూడా అందని పరిస్థితి, సాగునీరు రాని సందర్భం.. విత్తనాలకు క్యూలు, ఎరువులకు క్యూలు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంతో పరిస్థితి మొత్తం మారిందన్నారు.
అన్ని అమ్ముతారు కానీ.. ధాన్యం కొనరు – కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్.
-