హోంమంత్రి మహమూద్ అలీ ముందే కొట్టుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు

-

హైదరాబాద్ లో హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే టిఆర్ఎస్ నాయకులు బాహాబహీకి దిగారు. హైదరాబాద్ రాంకోఠి లోని రూబీ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, గోశామహల్ నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. అయితే వేదిక పైకి పిలవలేదని ఆర్వి మహేందర్ కుమార్ సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని నిలదీశారు.

ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హోంమంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారు. ఏకంగా బాహాబాహీకి దిగి కొట్టుకునే దాకా వెళ్ళడంతో గొడవపడుతున్న నాయకులను హోంమంత్రి మహమూద్ అలీ శాంతింప చేశారు. ఏవయినా ఇబ్బందులు ఉంటె కూర్చుని మాటలడుకోవాలి కానీ ఇలా నలుగురిలో గొడవ పడితే మన పరువే పోతుందని ఆయన సర్దిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news