టిఆర్ఎస్ వాళ్ళకి పదవులు బిజెపి పెట్టిన భిక్ష – రాజా సింగ్

-

టిఆర్ఎస్ వాళ్ళకి పదవులు బిజెపి పెట్టిన భిక్ష అని అన్నారు బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్.రోజు రోజుకి రాష్ట్రం లో బీజేపీ కి పెరుగుతున్న బలం చూసి టీఆరెస్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.ఈటెల రాజేందర్, మరికొంత మంది బీజేపీ నాయకులపై కొందరు టీఆరెస్ నాయకులు ఏవేవో పిచ్చి పిచ్చి గా మాట్లాడారని.. ఈటల గురించి మాట్లాడే అర్హత తెరాస నాయకులకు లేదనే విషయం ముందు గుర్తుంచుకోవాలన్నారు.

ఈటెల రాజేందర్ గారిని హుజురాబాద్ లో ప్రజలు ఆమోదం తెలియజేసి గెలిపించారనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. టిఆర్ఎస్ ను వ్యతిరేకించి బయటికి రావడం వలనే నేడు ఈటెల గారి మీద ఇటువంటి నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బురద రాజకీయాలు మీరు చేస్తూ ఎదుటివారిని విమర్శించడం మీ నైజమని అన్నారు.ప్రజల్ని తప్పుతో పట్టించడానికి చివరికి వర్షాలు విదేశీ కుట్ర అని చెప్పిన ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే సామాన్య మానవుడు సైతం ఆశ్చర్యపోయారని ఎద్దేవా చేశారు.

లిక్కర్ బ్రాండ్ నే అమెరికా రాజ్యాంగం రాసిన వ్యక్తిగా మన సీఎం గారు ప్రకటించడం ఆయన అవగాహనకు అద్దం పడుతోందన్నారు.దేశమంతా బిజెపి గెలుస్తోంది. తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలపడుతోందన్నారు.బిజెపి ఎదుగుదలని ఓర్వలేక కల్వకుంట్ల కుటుంబం ఉలిక్కి పడుతోంది.. అందుకే తమ వంది మాగధులతో అవకులు, చవాకులు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.క్లౌడ్ బరెస్ట్ గురించి మాట్లాడడానికి గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు ఏమైనా శాస్త్రవేత్త అని ప్రశ్నించే ముందు, మరి కెసిఆర్ ఏమైనా శాస్త్రవేత్త అన్న ప్రశ్న కూడా వేసుకుంటే బాగుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version