బ్రేకింగ్ : ట్రంప్ కి గుడి కట్టిన వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మృతి

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీరాభిమాని అయిన బుస్సా కృష్ణ గతేడాది 6 అడుగుల ట్రంప్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బుస్సా కృష్ణ ట్రంప్‌ విగ్రహానికి పూజలు చేస్తూ ఆయన్నే దేవుడిలా ఆరాధిస్తున్నాడు. అయితే ఆ మధ్య ఈ విషయాన్ని తెలుసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వచ్చినపుడు తన అభిమాని కృష్ణను కలుస్తానని కూడా చెప్పారు.

అయితే ఆయనని కలవకుండానే బుస్సా కృష్ణ గుండె పోటుతో మృతి చెందారు. క్పష్ణ స్వగ్రామం జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో మృతి చెందినట్టు చెబుతున్నారు. ట్రంప్ కు కరోనా సోకినప్పటి నుండి బాధతో ఉన్నాడు ఆ బాధలోనే గుండె పోటు వచ్చిందని అతని మిత్రులు చెబుతున్నారు. ట్రంప్ తన కలలోకి వచ్చేవారని.. ఆయన ఫొటో చూసి రోజు మొదలుపెడితే తనకు మంచి జరుగుతుందని.. అందుకే ఆయన్ను పూజిస్తున్నానని బుస్సా కృష్ణ చెబుతుండేవాడు.

Read more RELATED
Recommended to you

Latest news