TS: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ కు రేపే లాస్ట్ డేట్

-

పెండింగ్లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు రాష్ట్రంలోని వాహనదారులకు  పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే . అయితే పెండింగ్ చలాన్లపై  ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియనుంది. వాహనాలపై ఉన్న ఫైన్లు చెల్లించే వారు ఈ కన్సెషన్ ఆఫర్ వినియోగించుకోవాలనుకుంటే వెంటనే చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ విభాగం కోరింది. 2023 Dec 25కి ముందు ఉల్లంఘనలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల ఫోటోలు తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news