విద్యార్థులకు అలర్ట్‌.. టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

-

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు జ‌రిగాయి. ఈ నెల 14 నుంచి జ‌ర‌గాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. సెప్టెంబ‌ర్ 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. 8 నుంచి 12వ తేదీ వ‌ర‌కు అభ్యర్థుల ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 8 నుంచి 13 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవ‌డానికి స‌మ‌యం ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్లను కేటాయించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 22 నుంచి ఐసెట్ తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా

సెప్టెంబర్ 6 నుంచి- ఐసెట్ కౌన్సెలింగ్
సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు- సర్టిఫికేట్ల పరిశీలన
సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు- వెబ్ ఆప్షన్లు నమోదు
సెప్టెంబర్ 17న – ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు
సెప్టెంబ‌ర్ 22 నుంచి – ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్
సెప్టెంబర్ 28న -ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 29న – స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ , ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐసెట్ లో 86.17శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 61,092మంది అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version