బొత్స ఇంటికి కరెంట్ కట్.. క్లారిటీ ఇచ్చిన TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి

-

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై వైరల్ అవుతున్న ట్వీట్‌పై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని తన ఇంటి విద్యుత్ బిల్లును బొత్స 15 నెలలుగా చెల్లించడం లేదని, ఈ కారణంగానే ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా చెప్పే ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.

ఈ ట్వీట్‌పై స్పందించిన రఘుమారెడ్డి.. అది ఫేక్ ట్వీట్ అని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. సంస్థ పేరుతో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రఘుమారెడ్డి హెచ్చరించారు. సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని.. దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news