తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌ను మ‌ళ్లీ మూసివేసిన టీటీడీ

-

తిరుమ‌త ఘాట్ రోడ్ల విష‌యం లో టీటీడీ బోర్డు మ‌రో సారి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు తో పాటు రేపు కూడా రాత్రి స‌మయాల్లో తిరుమ‌ల ఘాట్ రోడ్ల ను మూసి వేస్తున్న‌ట్టు టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. రెండు రోజుల పాటు రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రెండు ఘాట్ రోడ్ల ను మూసి వేస్తున్న‌ట్టు టీటీడీ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. అయితే గురు వారం రోజు రాత్రి కూడా టీటీడీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంది.

గురువారం రాత్రి 8 గంట‌ల నుంచి మ‌రుస‌రి రోజు ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు తిరుమల లో ఉన్న రెండు ఘాట్ రోడ్ల ను పూర్తి గా మూసి వేసింది. అయితే ఈ రోజు కూడా ఘాట్ రోడ్ల విష‌యం లో మ‌రో సారి టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు త‌మిళ నాడు లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో తిరుమ‌ల ప్రాంతంలో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డుతున్నాయి. అందు వ‌ల్ల రాత్రి సమ‌యాల్లో ఘాట్ రోడ్ల ను మూసి వేస్తున్నారు. అయితే వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత ఘాట్ రోడ్ల ను తిరిగి రాత్రి స‌మ‌యాల్లో ప్రారంభించ నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news