టీఎస్ ఏపీ రాష్ట్రాలు నీటి లెక్కులు తెల‌పాల్సిందే – కేఆర్ఎంబీ

-

తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాలు వినియోగించుకుంటున్న నీటి లెక్క‌లు తెల‌పాల్సిందే న‌ని కేఆర్ ఎంబీ స్ప‌ష్టం చేసింది. దానికి కోసం తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ ఈఎన్సీలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది. నాగార్జున సాగర్ తో పాటు శ్రీశైలం జలాశయాల నుంచి తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్క లు త‌ప్ప‌క తెల‌పాల‌ని కేఆర్ఎంబీ రాసిన లేఖ‌లు ఉంది.

కాగ గ‌త కొద్ది రోజుల నుంచి నాగార్జున సాగ‌ర్ తో పాటు శ్రీ శైలం ప్రాజెక్టు ల నీటి వినియోగం పై రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు నెల‌కొన్నాయి. ఈ వివాదాల కు చెక్ పెట్ట‌డానికి కేఆర్ ఎంబీ ముందు అడుగులు వేస్తుంది. దాని కోసం రెండు రాష్ట్రాల అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ నున్నారు. న‌వంబ‌ర్ 17 న ఉద‌యం 11 గంట‌లకు జ‌ల సౌధ‌లో గోదావరి నదీ యాజమాన్య బోర్డ్ ఉప సంఘం సమావేశం జ‌ర‌గ‌బోతుంది. ఈ స‌మావేశంలో గెజిట్ నోటిఫికేషన్ చర్చ జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news