భార్గవి హత్య కేసులో ట్విస్ట్.. తల్లికాదు ప్రియుడే..!

-

ఇబ్రహీంపట్నం లోని దండుమైలారం డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి భార్గవి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. పరువు హత్యా, లేక ప్రియుడు చంపాడా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. భార్గవి సోదరుడు చరణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే భార్గవిని తన తల్లి చంపినట్లు చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. భార్గవి సోదరులు, ప్రియుడు శశిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. కాగా.. ఇప్పుడు భార్గవి హత్యకేసులో తల్లికాదు ప్రియుడు శశినే చంపాడని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్గవి తండ్రి ఐలయ్య మాట్లాడుతూ.. కన్నతల్లి ఎక్కడనైనా కూతుర్ని చంపుకుంటుందా? అని ప్రశ్నించాడు. నిన్న మధ్యాహ్నం నా భార్య ఇంటికి వచ్చే సరికి శశి ఇంట్లో ఉన్నాడని తెలిపాడు. నా భార్యను చూసి పారిపోయాడని వెల్లడించాడు.

నా కూతురు భార్గవిని శశి చంపి పారిపోయాడనేది అనుమానం ఉందని, అయితే నా కూతురును చూసి షాక్ తో నా భార్య మాట్లాడలేని పరిస్థితికి వచ్చిందని వాపోయాడు. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నామని తెలిపారు. భార్గవి మాత్రం శశిని పెళ్ళి చేసుకుంట నని చెప్పిందని తండ్రి తెలిపాడు. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో శశి వచ్చాడని, కొద్దిసేపటికే నా భార్య ఇంటికి వచ్చిందన్నారు. శశిని చూసిన కోపంతో భార్గవి వున్న గదికి వెళ్లింది. అయితే అప్పటికే భార్గవి చనిపోయిందని అది చూసిన తన భార్య షాక్ లో మాట్లాడలేని పరిస్థితిలో ఉందని భర్త తెలిపాడు. అది చూసిన తన కొడుకు చరణ్ తన కన్నతల్లే హత్య చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడని వాపోయాడు. తన భార్య కూతురిని హత్య చేయలేని క్లారిటీ చేశారు. మరి దీనిపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు ప్రియుడు శశి, సోదరుడు చరణ్ ను విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news