రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్..లావణ్య సూసైడ్ నోట్..!

-

రాజ్‌ తరుణ్-లావణ్య కేసు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వ్వహరంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తనను ప్రేమించి మోసం చేశాడని, పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది.

Twist in Lavanya and Raj Tarun case

తాను చనిపోతున్నానంటూ టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సూసైడ్ నోట్ పంపడం కలకలం రేపింది. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. ‘రాజ్ లేని ప్రపంచంలో నేను ఉండలేను. కానీ అతడు మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. దీనంతటికీ మాల్వినే కారణం. నా దగ్గరి వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news