విషాదం : ఫ్లెక్స్ కడుతూ కరెంట్ షాక్.. ప్రభాస్ అభిమానులు మృతి

-

ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా విషాదం చోట చేసుకుంది. ఆయన మీద అభిమానంతో ప్లెక్స్ కడుతున్న ఇద్దరు అభిమానులు చనిపోయారు. రెండు ప్రాంతాల్లో వేర్వేరు ఘటనలలో ఇద్దరు చనిపోయారు. యుద్దనపూడి మండలం పూనూరులో నలుగురు అభిమానులు ఫ్లేక్స్ కడుతోండగా అక్కడే ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయాలు కావడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

ఇక మరో పక్క పగో కాళ్ల మండలం L N పురంలో కూడా విషాదం చోటు చేసుకుంది. అక్కడ నలుగురు యువకులు కూడా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న నేపధ్యంలో ఆ ఫ్లెక్సీ విద్యుత్ వైర్లకు తాకడంతో గండికోట దుర్గాప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మిగతా ముగ్గురు యువకులని ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news