ఉగాదికి ‘SSMB29′ సినిమా అనౌన్స్ మెంట్ …?

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవల్లో నిర్మించబోతున్న ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు..ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం గురించి వినిపిస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఈ మూవీ ఓపెనింగ్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండోనేషియా స్టార్ చెల్సీ ఎలిజబెత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూట్‌ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్టు వేసే ప్లాన్‌లో ఉన్నారని వార్తలు వినిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెట్‌లోనే ఎక్కువభాగం షూటింగ్ జరుగనుందని తెలుస్తోంది .

Read more RELATED
Recommended to you

Latest news