బ్రేకింగ్‌ : కాబూల్‌ లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌

-

అప్ఘానిస్తాన్‌ రాజధాని అయిన కాబూల్‌ లో ఉక్రెయిన్‌ కు చెందిన ఓ విమానం హై జాక్‌ అయింది. ఉక్రెయిన్‌ దేశానికి చెందిన విమానాన్ని హైజాక్‌ చేశారు కొందరు దుండగులు. నిన్న ఈ విమానం హైజాక్‌ అయిందని ధృవీకరించింది ఉక్రేయిన్‌ విదేశాంగ శాఖ. అలాగే..ఈ హైజాక్‌ చేసిన విమానాన్ని ఇరాన్‌ దేశానికి ఆ దుండగులు తీసుకు పోయినట్లు గా గుర్తించింది ఉక్రేయిన్‌ విదేశాంగ శాఖ.

ఈ హైజాక్‌ అయినటు వంటి విమానం లో ఏకంగా 23 మంది ప్రయాణికులు ఉన్నారని… ఉక్రేయిన్‌ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే… ఆ దుండగుల ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. అసలు ఆ విమానాన్ని ఎందుకు హైజాక్‌ చేశారనే దానిపై ఉక్రేయిన్‌ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు హైజాక్‌ చేసిన వారిన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది. కాగా.. అప్ఘానిస్తాన్‌ పరిస్థితుల నేపథ్యం లో ఆ దేశం నుంచి అక్కడి ప్రజలు… ఇతర దేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news