వైకాపాబన్లు… తాలిబన్లను మించిపోయారు : నారా లోకేష్

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో సారి అధికార వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని ఎద్దేవా చేశారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరు పేదల ఇళ్లు జగన్ రెడ్డి కూల్చేసారని నిప్పులు చెరిగారు.. ఇప్పుడు భద్రత పేరు తో భరతమాత గుండెల పై గునపం దింపారని ఫైర్‌ అయ్యారు.

తనకి రూ. 2 కోట్ల తో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని తెలిపారు నారా లోకేష్‌.
ప్రొక్లయినర్ల తో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పు నః ప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు. చేసిన మూర్ఖపు పనికి ఏపీ సీఎం జగన్‌ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. కాగా… తాడేపల్లి సీఎం నివాసం వద్ద భరతమాత విగ్రహం తొలగించారు. దశాబ్దం క్రితం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహాన్ని
అర్ధరాత్రి క్రేన్ తో విగ్రహాన్ని తొలగించారు మున్సిపల్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news