సింగ‌రేణిలో మ‌రో ఘోర ప్ర‌మాదం..అండ‌ర్ మేనేజ‌ర్ మృతి..!

-

ఇటీవ‌ల కాలంలో సింగ‌రేణిలో ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రీసెంట్ గా శ్రీరాంపూర్ లోని బొగ్గుబావిలో న‌లుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం గా మారింది. సింగ‌రేణిలో అలాంటి ప్ర‌మాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. దాంతో కార్మికులు నిర‌స‌న‌కు దిగారు. ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి మృతుల కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. ఆ త‌ర‌వాత మ‌రో బొగ్గుబావిలో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర‌గాయాలు అయ్యాయి.

under manager died in singareni
under manager died in singareni

కాగా తాజాగా ఈ రోజు మ‌రో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో అండ‌ర్ మేనేజ‌ర్ మృతి చెందారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కేకే ఓసీపీ అండర్ గ్రౌండ్ లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో అండర్ గ్రౌండ్ మేనేజర్ పురుషోత్తం మృతి చెందారు. పురుషోత్తం తీవ్ర గాయాల‌తో మృతి చెందారు. ఆయ‌న శ‌రీరమంతా బొగ్గు బుర‌ద ఉండ‌గా….నోటి వ‌ద్ద తీవ్ర‌గాయాలు అయినట్టు క‌నిపిస్తోంది. కాగా పురుషోత్తం మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news