కేంద్ర మంత్రి ఇంట్లో తీరని విషాదం…!

-

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్‌ లోకి చెప్పారు. ట్వీట్‌తో పాటు తన తల్లి ఫోటోని కూడా ఆయన పోస్ట్ చేసారు. “ఈ రోజు నా తల్లి సులోచన సుబ్రహ్మణ్యం కన్నుమూసిన విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య సమయంలో ఆమెకు మద్దతు ఇచ్చిన వారందరికీ మా కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుందని ఆయన అన్నారు.

రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రముఖులు, రాజకీయ పార్టీలు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం జై శంకర్ మోడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. ఇటీవల రష్యా పర్యటనకు వెళ్ళిన ఆయన చైనా విదేశాంగ శాఖా మంత్రితో కూడా సమావేశం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news