కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి ‘పాశ్వాన్’ శాఖలు

-

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణం తరువాత ఆయన శాఖలయిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు అదనంగా అప్పగించారు. 56 ఏళ్ల గోయల్ ప్రస్తుతం రైల్వే మరియు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖలను కూడా కలిగి ఉన్నారు.

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా ప్రకారం, కేబినెట్ మంత్రి శ్రీ పియూష్ గోయల్, తన ప్రస్తుత శాఖలతో పాటు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. 74 ఏళ్ల లోక్ జన్శక్తి పార్టీ నాయకుడు, బీహార్‌కు చెందిన ఎన్‌డిఎ కూటమి భాగస్వామి అయిన రామ్ విలాస్ పాస్వాన్ నిన్న ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూశారన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news