అయ్యప్ప స్వాములకు కేంద్రమంత్రి రామ్మోహన్ శుభవార్త

-

అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. ఆదివారం విశాఖ – విజయవాడ మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండోగో విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాములు ఇక నుంచి ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనమతిస్తున్నట్లు ప్రకటించారు.

జనవరి 20 వరకు సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.త్వరలోనే భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని వెల్లడించారు. నిర్ణీత గడువు కంటే ముందే ఎయిర్‌పోర్టును పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.అదేవిధంగా త్వరలోనే ఇంటర్‌నేషనల్ కార్గో సెంటర్ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version