ఏపీ అసెంబ్లీలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. స్టాట్ అయిన వింట‌ర్ వార్‌..

-

ఏపీ అసెంబ్లీలో మార్షల్స్ దాడి అంశం కలకలం రేపింది. ఐదవ రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభం ప్రారంభమే తీవ్ర మాటల యుద్ధంతో ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు సభలోకి వచ్చేందుకు ప్రత్యేక గేటు ఉందన్న వైసీపీ నేత కొడాలి నాని.. చంద్రబాబు కావాలనే అసెంబ్లీ గేటువైపు వచ్చారనీ అందువల్లే ఇలా జరిగిందని అన్నారు. తప్పుడు పనులు చేసే చంద్రబాబు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు కొడాలి నాని. మ‌రోవైపు టీడీపీ సభ్యులు గురువారం సభలో వ్యవహరించిన తీరు బాధించిందని మంత్రి పేర్ని నాని అన్నారు.

అధినేత చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయ పడ్డారని, గౌరవ సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్ అడ్డుపెట్టుకొని ఎడిట్ చేసి పేర్నినాని చూపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో చీఫ్ మార్షల్ అనుచితంగా ప్రవర్తించిన ఫోటోలు, వీడియోలు తమవద్ద ఉన్నాయని ప్రకటించారు. మ‌రియుమార్షల్స్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version