పేద ప్రజల అభ్యున్నతే మా ప్రభుత్వం లక్ష్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతోందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ మీడియా మేనేజ్‌మెంట్‌పై నిర్వహిస్తున్న 2 వారాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీలంకకు చెందిన మీడియా నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చింది. రాష్ట్రానికి వచ్చిన బృందానికి స్వాగతం పలికిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారితో మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,ఎమర్జింగ్ టెక్నాలజీల రంగంలోనూ రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు.రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి అంత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రూ.500కే సిలిండర్ అందిస్తున్నామని మంత్రి వారికి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news