పంత్ జర నన్ను క్షమించు.. చేతులు జోడించి వేడుకున్న బాలీవుడ్ బ్యూటీ

-

టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య టీమిండియా వికెట్ రిషబ్ పంత్ పై సంచలన ఆరోపణలు చేసిన ఊర్వసి, ఇటీవల నసీమ్ షా ను ఉద్దేశించి ఓ వీడియోను షేర్ చేయడం సంచలనం సృష్టించింది. ఆసియా కప్ 2022 లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కు హాజరైన ఊర్వశి రౌటేలా మ్యాచ్ అనంతరం అతనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

ఇక తాజాగా ఇన్ స్టాంట్ బాలీవుడ్ అనే ఛానల్ తో మాట్లాడిన ఊర్వశి రౌటేలా, రిషబ్ పంత్ కు ఏం చెప్పాలనుకుంటున్నావని ప్రశ్నించగా, ఏం లేదనుకుంటూనే క్షమాపణలు చెప్పింది. హోస్ట్ ప్రశ్న వినగానే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఊర్వశి, ‘నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏం చెప్పాలి, ఏం చెప్పాలో తెలియడం లేదు. సారీ. ఐయామ్ వెరీ సారీ’ అంటూ రెండు చేతులు జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అభిమానులు మాత్రం పంత్ కు మానసిక ప్రశాంతతను అందించాలనే ఊర్వశి ఈ పని చేసిందని కామెంట్ చేస్తున్నారు. దీనిపై పంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news