వైశాలిని దాని కోసమే కిడ్నాప్ చేశా – నవీన్ రెడ్డి

-

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన వైశాలి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. 5 రోజుల కిందట పట్టపగలు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి ఏకంగా 100 మందితో యువతి ఇంటికొచ్చి నానా హంగామా చేశాడు. యువతి ఇంటి వద్ద ఉన్న కార్లను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కూడా కర్రలతో కొట్టారు. అయితే.. ఈ కిడ్నాప్‌ కేసు చేధించిన పోలీసులు..

వైశాలిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తాజాగా వైశాలి కిడ్నాప్ కేస్ లో నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. నాకు వైశాలి అంటే ఎంతో ప్రేమ. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా ప్రేమను వైశాలి మరియు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని ఇబ్బంది పెట్టాను. నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి నా దగ్గర పనిచేస్తున్న వారందరిని తీసుకువెళ్లి, కిడ్నాప్ చేశాను. భయంతో వైశాలిని వదిలేశాను అని నవీన్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news