వామ్మో.. డబ్బు కోసం అలాంటి పని చేసిన సమంత..!!

-

ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్లుగా చలామణి అవుతున్న ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాకముందు రకరకాల పనులు చేసిన ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే.. అయితే వీరు డబ్బు కోసం చేసిన పనులు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒకవైపు ఆశ్చర్య పోవడంతో పాటు మరొకవైపు దుఃఖం కూడా వస్తుంది. ఇక కెరియర్ లో స్థిరపడానికి ఎంతో మంది చేత చీత్కారాలు కూడా పడ్డవారు చాలామంది ఉన్నారు. ఇకపోతే కెరియర్ ఆరంభించక ముందు ప్రముఖ పాన్ ఇండియన్ హీరోయిన్ కూడా గతంలో వెల్కమ్ గర్ల్ గా పనిచేసిందట.

ఆమె ఎవరో కాదు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న తెలుగు స్టార్ హీరోయిన్ సమంత. సమంత హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎన్టీఆర్ , నాగచైతన్య , మహేష్ బాబు లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లు చేస్తూనే ఇంకోవైపు పాన్ ఇండియా సినిమాల్లో కూడా చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది..

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తినడానికి తిండి లేక ఒక పూట మాత్రమే భోజనం చేసేదట. ఇక అంతేకాదు పెద్ద పెద్ద ఫంక్షన్లకు హాజరయ్యే వారికి వెల్కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పనిచేసే రోజుకు 500 పారితోషకం తీసుకునేవారట సమంత. ఇక భోజనం లేక రెండు నెలలు గడిపిన ఈమె ఆ తరువాత డిగ్రీని పూర్తి చేయలేక మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అవుతూ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. కానీ తల్లిదండ్రుల బలవంతం మేరకు మళ్ళీ చదువుపై ద్రుష్టి మళ్లించి టాపర్గా నిలిచిందట సమంత. ఉన్నత చదువులు చదవాలనుకున్నా డబ్బు లేక తన కలను వదిలేసుకుంది.. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దేశం గర్వించదగ్గ హీరోయిన్ గా చలామణి అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news