త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న వంగవీటి రాధాకృష్ణ

-

వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిలా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ తో పాటు నరసాపురం కు చెందిన పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం అక్టోబరులో జరగనున్నట్టు తెలుస్తోంది. కాగా, రాధా ఓ ఇంటివాడు కానుండడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ నిశ్చితార్థం నరసాపురంలో పెద్దల సమక్షంలో జరిగింది. పుష్పవల్లి తండ్రి టీడీపీ లో సుదీర్ఘ కాలం పోషించారు. మధ్యలో కొంత కాలం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. తిరిగి నర్సాపురం వచ్చి అక్కడే ఇంటి నిర్మాణం చేపట్టారు. కొంత కాలం క్రితం జనసేనలో చేరారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యారు. గత నెలలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లొ వారాహి యాత్ర సమయంలో నర్సాపురంలో ఉన్న సమయంలో వీరి ఇంటిలోనే బస చేసారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version