టిడిపికి కుక్కలుగా రామకృష్ణ పని చేస్తున్నారు – వెల్లంపల్లి

-

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. అనంతరం.. సిపిఐ రామకృష్ణ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. టిడిపి కి తొత్తులుగా, కుక్కలుగా రామకృష్ణ వంటి వారు పని చేస్తున్నారు.. బిసి ల కార్పొరేషన్ లు పెట్టి వారి అభివృద్ధి కి నిధులు ఇచ్చిన సిఎం జగన్ మాత్రమేనని తెలిపారు.

సీపీఐ రామకృష్ణ డబ్బులకు అమ్ముడుపోయిన వ్యక్తి అని.. టీడీపీకి అమ్ముడు పోయిన పార్టీ సీపీఐ అని వివరించారు. డబ్బులకోసం అమ్ముడుపోయారు కాబట్టే సీపీఐ నాయకులకు ఈరోజు ఏగతి పట్టిందో అందరూ చూస్తున్నారని.. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. మైనార్టీల పై దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని.. బీసీలు,ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని వెల్లడించారు. మా సీఎంను ఆడిపోసుకోవాలని చూస్తే ఊరుకోం… సీపీఐ రామకృష్ణ,చంద్రబాబు వంటి దుష్టులు, దుర్మార్గులు ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news