IPL 2023 : విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు.. సంబురాల్లో ఫ్యాన్స్

-

IPL హిస్టరీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం ఆడుతున్న తొమ్మిది యాక్టివ్‌ టీమ్స్‌పై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్​గా నిలిచాడు. ఐపీఎల్‌ 16వ ఎడిషన్​లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన విరాట్​.. ఈ అరుదైన రికార్డును సాధించాడు.

లక్నో సూపర్ జెయింట్స్​తో మ్యాచ్‌కు ముందు మిగిలిన ఎనిమిది ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. అలానే తాజా మ్యాచ్​లోనే ఓ అర్ధ శతకం బాదాడు. ఇది అతడికి ఐపీఎల్‌ కెరీర్‌లో 46వది కావడం విశేషం.

ఐపీఎల్‌ టీమ్స్‌పై కోహ్లీ బాదిన హాఫ్​ సెంచరీలు..

చెన్నై సూపర్ కింగ్స్ – 9

దిల్లీ క్యాపిటల్స్‌ – 8

ముంబయి ఇండియన్స్ – 5

కోల్‌కతా నైట్ రైడర్స్ – 5

రాజస్థాన్ రాయల్స్ – 4

సన్‌రైజర్స్ హైదరాబాద్ – 4

గుజరాత్ లయన్స్ – 3

పంజాబ్ కింగ్స్ – 3

రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్​ – 3(నో యాక్టివ్​)

డెక్కన్ ఛార్జర్స్ – 3(నో యాక్టివ్​)

గుజరాత్ టైటాన్స్ – 2

లఖ్​నవూ సూపర్ జెయింట్స్ – 1

పూణె వారియర్స్ – 1(నో యాక్టివ్​)

కొచ్చి టస్కర్స్ – 0(నో యాక్టివ్​)

Read more RELATED
Recommended to you

Latest news