ఓటీటీలో వెంకటేశ్ సినిమా.. భారీ ఆఫర్లు వస్తున్నాయా!

-

ఫ్యామిలీ హీరోగా విక్టరీ వెంకటేశ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దృశ్యం-2ను రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ మళయాళంలో హిట్ అయ్యిన ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. మలయాళంలో దృశ్యం-2ను తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా ఇప్పటికే హీరో వెంకటేష్ కు సంబంధించిన కేరెక్టర్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశారు. మిగిలిన షెడ్యూల్ వారం పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. 2014లో వచ్చిన దృశ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ మైమరిపించాయనే చెప్పాలి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నాడు అనే కథనంతో సాగుతుంది సినిమా. ఇప్పుడు సీక్వెల్ లో మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్ర పోషిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయకుండా.. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోందంట. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థ ఈ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చిందంట. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటం, ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో నిర్మాత సురేష్ బాబు.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే కలెక్షన్స్ పరంగా కొంచెం నిరాశే అని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version