సల్మాన్ ఖాన్ తో వెంకటేష్ మల్టీ స్టారర్.. నిజమేనా..?

-

ఇటీవల కాలంలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపించి మరింతగా అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా కండల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కనిపించిన ఈయన ఇప్పుడు 2023లో ఈయన నటించిన భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఈయన నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలు టైగర్ 3, కిసీకా భాయ్ కిసీకా జాన్ వంటి చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా 2023 ఈద్ రోజున థియేటర్లలోకి రానుందని ప్రకటిస్తూ ఇటీవల ఒక చిన్న వీడియో ద్వారా వెల్లడించారు. అయితే ఈరోజు సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా షూటింగ్ పూర్తయింది అని కూడా తెలిపారు. ముఖ్యంగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తోంది ఫర్హాద్ సామ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఒలంపిక్స్ విజేత బాక్సర్ విజయేందర్ సింగ్, జగపతిబాబు కూడా నటించారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ పతాకం పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ , వెంకటేష్ కలిసి నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మంచి సక్సెస్ అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి తెలుగులో ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు ఎదురు చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news