కరోనా నుంచి కోలుకున్న వారికి వెంకటేష్ పిలుపు..?

-

ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. దీంతో రోజురోజుకు ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి . ఈ వైరస్ వెలుగు లోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఈ వైరస్కు సరైన వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడం మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకుంటుంది. రోజురోజుకు కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో… ప్రస్తుతం అందరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కేసులు పెరిగి పోవడంతో పాటు దేశంలో అధిక రికవరీ రేటు కూడా భారీగానే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేనందున కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలి అంటూ పలువురు ప్రముఖులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హీరో వెంకటేష్ కూడా ప్లాస్మా దానానికి అందరూ ముందుకు రావాలి అంటు పిలుపునిచ్చారు. ఇప్పటికే చిరంజీవి నాగార్జున అమల మహేష్ సాయి తేజ లాంటి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్లాస్మా దానం చేయాలని రిక్వెస్ట్ చేయగా ఇప్పుడు వెంకటేష్ ప్లాస్మా దాతలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news