పాప చనిపోయినా… తన వల్ల ఎవ్వరూ నష్టపోకూడదని విజయ్ ఆంథోనీ నిర్ణయం !

-

గత వారమే ప్రముఖ తమిళ్ హీరో విజయ్ ఆంథోనీ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుం మరణించింది. కనీసం పది రోజులు అయినా కాకముందే … అప్పుడే విజయ్ కెమెరా ముందుకు రావడం అందరినీ ఎంతగానో షాక్ కు గురి చేస్తోంది. విజయ్ కూతురు పోయిన బాధలో ఎంత దుఃఖంలో ఉంటాడన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. అందుకే విజయ్ ను డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశ్యంతో తన లేటెస్ట్ మూవీ రత్నం టీం అంతా కూడా ప్రమోషన్స్ కు అతన్ని పిలిచే సాహసం చేయలేకపోయారు.. కానీ తన వలన ఎవ్వరూ బాధపడకూడదు మరియు నష్టపోకూడదు అని ఆలోచించిన విజయ్ అంత బాధలోనూ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కెమెరా ముందుకు వచ్చాడు. రత్నం సినిమా వచ్చే వారంలో అక్టోబర్ 3న విడుదల అవుతుండడంతో ఇప్పుడు చేసే ప్రమోషన్స్ చాలా ఉపయోగపడనున్నాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో విజయ్ పైన అందరూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు. ఇక మూవీ యూనిట్ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ లు అయితే అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news