వైసీపీ మేనిఫెస్టో అప్పుడే.. విజయ్ సాయి రెడ్డి ప్రకటన..!

-

వైసిపి ఎన్నికల మేనిఫెస్టో మీద ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. బాపట్ల జిల్లాలో మేదరమెట్ల దగ్గర జరగబోయే నాలుగవ సిద్ధం సభ పోస్టర్ని రిలీజ్ చేసి, ఈ సభలోనే వైసీపీ మేనిఫెస్టోని కూడా సీఎం జగన్ విడుదల చేయనున్నారని అన్నారు. సిద్ధం సభకి సంబంధించి ఏర్పాట్లు అని విజయసాయిరెడ్డి పరిశీలించారు.

ఆయన మాట్లాడుతూ మేదరమెట్టలో సిద్ధం సభని ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని ఇంతకాలం చేసిన అభివృద్ధి అలానే సంక్షేమం తదితర విషయాలని సీఎం జగన్ వెల్లడిస్తారని అన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కూడా ఇదే సభలో విడుదల చేస్తామని చెప్పారు ఇటీవల మ్యానిఫెస్టోలో పొందపరచిన అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news