చంద్ర‌బాబుకు ఉన్న వ్యాధి.. దాని ల‌క్ష‌ణాలు చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి..!!

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై.. రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు కాదు కాదు ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా ట్విట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. ఇక తాజాగా కూడా అదే జ‌రిగింది. అయితే ఈ సారి విజ‌య‌సాయి రెడ్డి చంద్ర‌బాబుకున్న వ్యాధి.. దాని ల‌క్ష‌ణాలు చెప్పి ఎద్దేవ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి లక్షణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

‘చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. మ‌రియు అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version