కుషాయిగూడలో అగ్ని ప్రమాదం..బాధిత కుటుంబాలకు గద్వాల్ విజయలక్ష్మి ఆర్థిక సాయం

-

కుషాయిగూడ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబానికి ఆరు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.కుషాయిగూడ టింబర్ డిపోలో వేకువ జామున జరిగిన అగ్ని ప్రమాదంలో పక్క బిల్డింగ్ లో నివసిస్తున్న కుటుంబం దట్టమైన పొగ వలన శ్వాస ఆడక నిద్రలోనే మరణించడం జరిగింది.

ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సహాయక చర్యలను చేపట్టాలని జోనల్ కమిషనర్, మరియు స్థానిక కార్పొరేటర్ కు తెలిపారు.ప్రమాదం లో మరణించిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలను సాయాన్ని అందిస్తామని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు. ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం తరుపున సాయం అందించాలని మేడ్చల్ కలెక్టరు ను మేయర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version