రఘురామ సూసైడ్‌ చేసుకున్నా..తప్పు వైసీపీదేనా ? : విజయసాయి

-

తనకు ప్రాణహాని ఉందని..నర్సాపురం, వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంపీ రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రఘురామ ఆత్మహత్య చేసుకున్నా.. వైసీపీదే తప్పు అంటారా అని ఫైర్‌ అయ్యారు.

” గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని ‘నన్ను చంపేస్తారు’ అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం.” అంటూ కౌంటర్‌ ఇచ్చారు విజయసాయిరెడ్డి.

మాచర్ల హత్య నేపథ్యంలో చంద్రబాబు కుట్ర రాజకీయం అని మండిపడ్డారు. రాష్ట్రంలో హింస, అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. లారీల్లో జనాన్ని తీసుకురండి, వ్యవహారం వేరేలా ఉండాలన్నారు. స్టేట్ ఇష్యూ చెయ్యాలని పిలుపు. పరామర్శ వెనుక బాబు అసలు అజెండా ఇది. కానీ కథ అడ్డం తిరిగి తానే అల్లరిపాలయ్యాడని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news