గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై షాకింగ్ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి..!!

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదల చేయబోతున్న చిత్రం గాడ్ ఫాదర్.. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 28 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయడానికి ప్లాన్ చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడడం జరిగింది. ఇకపోతే ఇదే విషయంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇకపోతే మలయాళం లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తో పాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ తన అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు. ఇక చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బుధవారం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించడం జరిగింది. ఇక విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది.. ఆయనకు నా శుభాకాంక్షలు.. నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజింప చేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం.. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.. అంటూ చిరు పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇకపోతే ఈ ఈవెంట్ కి చిరంజీవితో పాటు సినిమా బృందం మొత్తం హాజరు కాబోతున్నారు. మరి నయనతార ఈ ఈవెంట్ కి వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో సత్యదేవ్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version