తెలంగాణ వరద బాధితులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ విరాళం

-

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలు ప్రకటించారు. ఇటీవలే కుమారి ఆంటీ కూడా రూ.50వేలు ఆర్థిక సహాయం అందించింది. తాజాగా  భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. 

సీఎం సహాయనిధికి రూ.1కోటి 25 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీగా ఆస్తి, కొంత మేరకు ప్రాణ నష్టం జరిగింది. వరదల వల్ల చాలా మంది నిరాశ్రయిలయ్యారు. దీంతో వరద బాధితులకు సహాయం చేసేందుకు మా భాష్యం విద్యాసంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. బాధితులకు అండగా నిలించేందుకు ముందుకు వచ్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ ఇటీవలే రూ.4కోట్ల భారీ విరాళానికి సంబంధించిన చెక్కును అందించిన విషయం తెలిసిందే. –

Read more RELATED
Recommended to you

Exit mobile version