విగ్గురాజుకు పెగ్గు చాలక…కల్లు తాగిన కోతిలా అయ్యాడు – విజయసాయి

-

విగ్గురాజుకు పెగ్గు చాలక…కల్లు తాగిన కోతిలా అయ్యాడని రఘురామ రాజును ఉద్దేశించి విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్గురాజుకు పెగ్గు చాలక…నాటుకొట్టి కల్లు తాగిన కోతిలా అయ్యాడు. దేశానికి వెన్నెముకైన బీసీల మీద నోరు పారేసుకుంటున్నాడని చురకలు అంటించారు. నిజమైన ముఖాన్ని చూపించలేని నువ్వు…సున్నాకి ఎక్కువ పాయింట్ ఫైవ్‌కు తక్కువ గబ్బు రాజా! అని మండిపడ్డారు.

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి…ఢిల్లీలో బ్రోకర్ పనులు చేస్తూ బతికే నీకన్నా పెద్ద క్రిమినల్ ఎవర్రా విగ్గు అలియాస్ పెగ్గు అలియాస్ గబ్బురాజా? నువ్వు కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు…బిన్ లాడెన్ శాంతి ప్రవచనాలు చెప్పినట్లే ఉందన్నారు విజయసాయిరెడ్డి.

అటు టీడీపీని కూడా విమర్శించారు సాయిరెడ్డి. గుర్తుందా ఎల్లోస్! 2014లో తెలుగు డ్రామాల పార్టీ అధికారంలోకి వచ్చినా…మాపార్టీ ఎమ్మెల్యేలపైనే ఆధారపడ్డారు. వారిని కొన్నారు. ఇప్పుడు విగ్గురాజు ‘పెగ్గు మాటల’తో కామెడీ పండిస్తున్నాడు. ఎన్నాళ్లీ అద్దె మైకులు? దారితప్పిన వాళ్ళతో రాజకీయాలు? సేమ్ సీన్ -సేమ్ రిజల్ట్ రిపీట్స్! అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news