టీడీపీ కుప్పం కోట బద్దలైంది.. విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో భాగంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో చైర్ పర్సన్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో గెలవడం తో విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కుప్పం కోట బద్దలు అయ్యిందని విజయ సాయి రెడ్డి అన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం లోని కుప్పం మున్సిపాలిటీ లో వైసీపీ విజయభేరి మోగించిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

vijayasaireddy-babu
vijayasaireddy-babu

దీనిని బట్టి రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఎన్నో ఏళ్లుగా గెలిపిస్తున్న ఆయన సొంత నియోజకవర్గం లోని ప్రజలే బాబును నమ్మలేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ వైసీపీ దూసుకుపోతోంది. దాంతో వైసీపీ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అంతే కాకుండా ఈ విజయాలతో వైసీపీ లో జోష్ రెట్టింపు అవుతోంది. అంటే కాకుండా టీడీపీ ని ఈ ఫలితాలు మళ్లీ నిరాశ పరుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news